Posted on 2025-12-13 08:36:27
మెస్సీ,తో అవినీతి పరుడు గుంపు మేస్త్రి సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ బాల్ ఆడడం సిగ్గుచేటు
నిజామాబాద్ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మెస్సి క్రీడతో రాష్ట్రంలో రాక్షస క్రీడ జరగబోతుందని ఆ క్రీడలో అవినీతిపరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్లు మెస్సి ఫుట్బాల్ ఈవెంట్ ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మెస్సీ సాకర్ వీరుడు అయితే రేవంత్ రెడ్డి బ్రోకర్ వీరుడు అని విమర్శించారు. సింగరేణి ప్రజల రక్తపు చెమట 100 కోట్లను ఈ క్రీడలకు దుర్వినియోగం చేయటం దారుణమన్నారు. దుబాయ్ షేక్ ఎంరెడ్స్ జెర్సీ ప్రమోట్ చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంత వాటా తీసుకుంటున్నారో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ క్రీడా డ్రామా అని అన్నారు. రాష్ట్రంలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో 40 శాతం బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ తో ప్రజలు ఫుడ్ బాల్ ఆడారని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >