| Daily భారత్
Logo




చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

News

Posted on 2025-12-06 15:34:05

Share: Share


చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా చంద్రుగొండ పోలీసు వారు పట్టుకున్నారు. చంద్రుగొండ పోలీసు వారు వాహన తనిఖీలలో భాగంగా తనిఖీ చేస్తుండగా  గూడ్స్ క్యారియర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 280 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం  విలువ రూ. 5,60,000/-. వాహన డ్రైవర్ అరుణ్ కుమార్ రాజ్‌బార్ విచారణలో, రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు ఆంధ్ర మరియు తదితర ప్రాంతాలలో కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అధిక ధరలకు అమ్మే అక్రమ వ్యవస్థలో తాము భాగస్వాములమని, ఇందులో లారీ యొక్క యజమాని మరియు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులకు ఒప్పుకున్నాడు.

పోలీసులు అశోక్ లేలాండ్ లారీ CG 17 KZ 8355, 280 క్వింటాళ్ల  రేషన్ బియ్యం మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఈరోజు జ్యుడీషియల్  రిమాండ్‌కు పంపించారు.ఈ ఆపరేషన్ మొత్తం కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్  మార్గదర్శకత్వంలో మరియు జూలూరుపాడు సి.ఐ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో చంద్రుగొండ పోలీస్ వారు సమర్థవంతంగా నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులైనా కఠిన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చుండ్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్

Posted On 2026-04-20 18:40:20

Readmore >
Image 1

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు

Posted On 2026-04-20 18:18:28

Readmore >
Image 1

టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి

Posted On 2026-04-20 16:51:57

Readmore >
Image 1

వేములవాడలో సినీనటి పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-20 15:42:35

Readmore >
Image 1

ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-20 15:16:27

Readmore >
Image 1

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

Posted On 2026-04-20 14:59:28

Readmore >
Image 1

మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

Posted On 2026-04-20 14:58:10

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

Posted On 2026-04-20 13:57:43

Readmore >
Image 1

బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

Posted On 2026-04-20 13:41:10

Readmore >
Image 1

జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

Posted On 2026-04-20 13:39:01

Readmore >