డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దివ్యాంగులకు పింఛను 500 రూపాయల నుంచి 4 వేల రూపాయలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని దాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6 వేల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలో రాగానే ఆ వాగ్దానాన్ని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు అనేక రకాల హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నెరవేర్చలేదన్నారు. దివ్యాంగుల దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మురుకుంట్ల అరవింద్ శర్మ, అర్కల భూపాల్ రెడ్డి, రాజ్ కుమార్, రమేష్, విజయ్, లక్ష్మణ్, గోపి యాదవ్, విజయలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News
దివ్యాంగులకు 4వేల పింఛను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి