Posted on 2025-11-30 03:09:40
త్వరలో సంఘాల భేటిసమస్యలన్నీ పరిష్కరిస్తాం అని మంత్రి హామీ
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా; జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూకే.ఎఫ్) రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలోని తన చాంబర్లో టీడబ్ల్యూజేఎఫ్ ఆర్ట్స్క్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ఉపాధ్యక్షులు పి రాధిక, గుడిక రఘు, బి.రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, హెచ్ఎయూజే అధ్యక్షులు బి అరుణ్కుమార్, నాయకులు అచ్చిన ప్రశాంత్ తదితరులు మంత్రిని కలిశారు. దాదాపు గంటపాటు జర్నలిస్టుల సమస్యంపై చర్చించారు. వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కొత్త ఆరోగ్య కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇండ్లస్థలాల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని మంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇండ్లస్థలాల సమస్యలతో జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టుతో సమావేశం నిర్వహించి పరిష్కరించాలని అన్నారు. చనిపోయిన జర్నలిస్టులకు రూ. 20 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలని సూచించారు. మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట పనిచేసే చోట నుంచి ఇంటివరకు రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ వసతిని ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమటీలు ఏర్పాటు చేయాలనీ, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి అటాక్స్ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలో జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అంతకుముందు సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్బాబు, అదనపు డైరెక్టర్ డిఎస్ జగన్ కు సైతం వినతిపత్రాలు అందజేశారు..
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >