Posted on 2025-11-24 07:01:10
జిల్లాలోని చందూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం
పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్.. పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ చదువు ఒత్తిడి నే కారణమా.. లేదా ఇతర ఏదైనా కారణాలు ఉండవచన్న అనుమానాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏది ఏమైనా చిన్న వయసులోని అది ఓ ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని ఎస్సై సాయన్న వివరించారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >