Posted on 2025-11-23 03:36:00
డైలీ భారత్ న్యూస్,పటాన్చెరు:స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన పటాన్చెరు విద్యార్థులను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు పట్లోళ్ల ఆర్యన్ రెడ్డి, తీర్థ అనే విద్యార్థులు ఇటీవల వికారాబాద్ లో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ సెలక్షన్స్ లో పాల్గొని ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం పటాన్చెరు శాసన సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >