Posted on 2025-11-18 15:05:47
డైలీ భారత్, హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచూ బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. బాంబు ఉన్నట్లు మెయిల్ రావడంతో విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయి తనిఖీలు చేయడం.. ఆ తరువాత అవి ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది. అయితే ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వార్తలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పడు తాజాగా మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఈరోజు (మంగళవారం) ఉదయం 10:05 గంటలకు ఎయిర్పోర్టులో బాంబు ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్లో హెచ్చరించారు. కసబ్ను మైనర్గా విచారణ చేయకుండానే ఉరి తీశారని మెయిల్లో రాశారు. ఈరోజు ఆపరేషన్ కోసం లాజిస్టిక్స్ సిద్ధం చేయడానికి 3 నెలలు పట్టిందని మెయిల్ సారాంశం.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో ఉన్న ముస్లింలు, మహిళలు, పిల్లలను ఖాళీ చేయాలని కోరుతూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్టులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా విమానాశ్రయ సిబ్బంది ఆరా తీసే పనిలో ఉన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >