Posted on 2025-11-14 13:19:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు పూర్తి వివరాలను రాబడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఏ పని జరిగిన మొదలు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలని చందం గా పరిస్థితి మారిందని పెద్ద ఎత్తున స్థానికంగా విమర్శలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు .. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని దాడి చేశారా..? లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనే విషయం లో స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >