Posted on 2025-11-14 17:49:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు పూర్తి వివరాలను రాబడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఏ పని జరిగిన మొదలు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలని చందం గా పరిస్థితి మారిందని పెద్ద ఎత్తున స్థానికంగా విమర్శలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు .. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని దాడి చేశారా..? లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనే విషయం లో స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
బిజ్జరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాసాగర్ ఘన విజయం
Posted On 2025-12-11 20:32:02
Readmore >
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-12-11 19:23:59
Readmore >
డాక్టర్ ఏ.విశాల్ నూతన పిల్లల మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రారంభించిన సీపీ
Posted On 2025-12-11 19:14:34
Readmore >
ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2025-12-11 11:52:42
Readmore >
అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు
Posted On 2025-12-11 11:17:56
Readmore >