Posted on 2024-01-10 06:40:42
డైలీ భారత్, పటాన్చెరు: కుమారుడు కొత్త దుస్తులు కొనివ్వలేదని అలిగిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్సై రమణాచారి వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చాకిరేవుపల్లికి చెందిన రమణయ్య(63) కుమారుడు మహేశ్తో కలిసి 6నెలల క్రితం అమీన్పూర్ పురపాలక పరిధి పీజేఆర్ఎన్క్లేవ్ కాలనీకి వచ్చారు..
మహేశ్ ఓ స్థిరాస్తి సంస్థలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. 3నెలల క్రితం రమణయ్యకు పక్షవాతం వచ్చింది. మంగళవారం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా తనకు కొత్త దుస్తులు కొనాలని కుమారుడిని రమణయ్య అడిగాడు. జీతం వచ్చిన తరువాత కొంటానని మహేశ్ చెప్పాడు. దీనిపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. మహేష్ ఉదయం బాత్రూంకు వెళ్లి వచ్చేసరికి సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న కమాన్కు రమణయ్య ఉరేసుకున్నాడు..
ప్రియురాలు ఫోన్ బ్లాక్ చేసిందని.. హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు
Posted On 2026-04-04 06:39:15
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా... సురక్షిత సమాజంకోసం – సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి : ప్రభుత్వ విప్
Posted On 2026-04-04 06:08:38
Readmore >
బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!!
Posted On 2026-04-04 05:32:56
Readmore >