Posted on 2025-11-02 18:36:34
భద్రాద్రి జిల్లా మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు.
ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడి చేస్తారా, ఈ దాడి ఓ పిరికిపంద చర్య అని మండిపడ్డారు..
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గుండాలతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేశారని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించాలని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఆని ప్రశ్నించారులా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తారు..
గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దాడులు జరగడంలేదని గుర్తుచేసారుబీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >