Posted on 2025-10-31 20:10:36
ర్యాలీ ప్రారంభించిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆద్వర్యంలో " కొవ్వొత్తుల ర్యాలీ " కార్యక్రమం నిర్వహించారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీసు, ఎన్.టి.ఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల పెట్టరు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎవ్వరు కూడా మరవరు అని, వారి త్యాగాల వలన నేడు ప్రతీ ఒక్కరు శాంతియుతంగా ఉంటున్నారని, అమరవీరుల కుటుంబాలకు యావత్తు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ )జి. బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) రామచందర్ రావు నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వుఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ బాబు, సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >