కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రౌడీ షీటర్ చేతిలో అత్యంత దారుణంగా వీర మరణం పొందిన సిసిఎస్ కానిస్టేబుల్ మృతి ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించారు..
భారతీయ జనతా పార్టీ తరఫున, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వారికి అండగా ఉంటామని తెలియజేశారు. పరామర్శించిన వారిలో బిజెపి నాయకులు,
నగ్గొల్ల లక్ష్మి నారాయణ, బి.ఆర్ శివప్రసాద్, పద్మరెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు