| Daily భారత్
Logo




కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు "బుధవారం బోధన" : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

News

Posted on 2025-10-22 22:14:53

Share: Share


కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు "బుధవారం బోధన" : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన

డైలీ భారత్, కరీంనగర్: విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు బుధవారం బోధన కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 

జిల్లావ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షించారు. మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

9వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్ బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకొని చదవాలని అన్నారు. శ్రద్ధ అంకితభావంతో నేర్చుకోవాలని సూచించారు. బుధవారం బోధన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్య ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులతో కలిసి భోజనం

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ పిల్లలకు కొన్ని సూచనలు చేశారు. కూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలు, గుడ్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయని విద్యార్థులను ప్రశ్నిస్తూ వారికి వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే కల్పించాలని విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు చేతులు కడుక్కునే చోట నల్లాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >
Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >
Image 1

భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

Posted On 2026-05-11 19:52:59

Readmore >
Image 1

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-11 19:12:13

Readmore >