Posted on 2025-10-22 18:37:52
ఆయన కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందటం ఆయన కుటుంబాన్నికి, పోలీస్ కుటుంబానికి ప్రత్యేకంగా ఆయన కుటుంబానికి తీరని లోటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆయన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి వెళ్లి ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాంటి చర్య దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని రౌడీషీటర్ రియాజ్ దారుణంగా హతమార్చడం తీవ్ర బాధను కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబం కి బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎప్పుడు ఇలాంటి ఇబ్బందు ఉన్న తన దగ్గరికి వచ్చి నిర్భయంగా అడిగితే సాయం చేయడానికి ముందు వరుసలో నిలబడతానని అన్నారు. అలాగే ప్రమోద్ పెద్ద కుమారుడు చదువు నిమిత్తం పదో తరగతి వరకు ఉచితంగా అందుకు అయ్యే ఫీజు ఖర్చులు ఇతర పుస్తకాల ఖర్చులు మొత్తం తానే భరిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >