Posted on 2025-10-22 18:11:15
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుదవారం షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో నూతన సి.సి రోడ్లు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని అన్నారు.ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అని అన్నారు.రోడ్లను, నగరాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం సహాకారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి , షాబాద్ తహసీల్దార్ అన్వర్ , మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, వెంకటరెడ్డి, అశోక్, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ నాయక్, ఖాజామియా పటేల్, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, సుభాష్ రెడ్డి, కిషోర్, శీను, శ్రీరామ్ రెడ్డి, వెంకటరెడ్డి, వేణు,, శ్రీనివాస్, రఫీక్ ,యాదయ్య, మహేష్, రాఘవేందర్, రమేష్, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >