| Daily భారత్
Logo




పార్వతీపురం RTC కాంప్లెక్స్ లో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు

News

Posted on 2025-10-19 17:35:37

Share: Share


పార్వతీపురం RTC కాంప్లెక్స్ లో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

డైలీ భారత్,పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా లో ఇవాళ(ఆదివారం) భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లు దించుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా... మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.

క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, సామగ్రి మెుత్తం ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ అధికారులు, స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. బాణసంచా పేలుడా? లేక ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

Posted On 2026-05-10 13:12:35

Readmore >
Image 1

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

Posted On 2026-05-10 12:16:45

Readmore >
Image 1

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-10 11:54:36

Readmore >
Image 1

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

Posted On 2026-05-10 11:52:11

Readmore >
Image 1

పెళ్లి పేరుతో వంచన... దేవస్థానం ఉద్యోగిపై కేసు నమోదు.?

Posted On 2026-05-10 11:10:13

Readmore >
Image 1

ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

Posted On 2026-05-10 08:24:05

Readmore >
Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >