Posted on 2024-01-04 15:08:11
డైలీ భారత్, హైదరాబాద్: స్కూల్ బస్సును నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కండీషన్ లేని బస్సులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బస్సు డ్రైవర్లపైనా, వారిని కిరాయికి తీసుకున్న స్కూల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటున్న డ్రైవర్ల ధోరణి మాత్రం మారడం లేదు.
డ్రైవర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఉస్మాని యా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హబ్సిగూడ రవీంద్రనగర్ లో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.
హబ్సిగూడ రవీంద్రనగర్లో నేటి ఉదయం తమ బాబు ని జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా, పక్కనే అమ్మమ్మ చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి కిందికి జారి తెలియకుండానే బస్ టైర్ కిందకి పడిపోయింది.
అమ్మమ్మ చూసే లోపే ఘోరం జరిగిపోయింది. బస్సు ఆపాలని పిలిచేలోపే చిన్నారిపై బస్సు టైరు వెల్లింది పాప టైరు కింద ఉండటంతో.. బస్ డ్రైవర్ గమనించలేదు, బస్ను ముందుకు తీయడంతో చిన్నారి టైర్ కింద పడి అక్కడికక్కడే చనిపో యింది.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చేప ట్టారు. విషయం తెలుసు కున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >