డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గాయత్రీ నగర్ కు చెందిన మోత్కూరి కిషోర్ (39) వాచ్మెన్ పనిచేస్తున్నాడు. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News
కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య