Posted on 2025-10-15 10:15:26
డైలీ భారత్, గుంటూరు:రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ రోమాలు నిక్కబొడిచే దారుణమైన ఘటన గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైల్లో చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో గుర్తు తెలియని దుండగుడు మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన సమయంలో రైలు ఆంధ్రప్రదేశ్లోని పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణిస్తోంది. బాధితురాలి హ్యాండ్బ్యాగ్ను దోచుకున్న దుండగుడు, వెంటనే స్టేషన్ వద్ద దిగిపోయి పరారయ్యాడు.
షాక్కు గురైన మహిళ చర్లపల్లికి చేరుకున్న వెంటనే జీఆర్పీ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో రైలులో జరిగిన ఈ దారుణం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. రైల్లో సెక్యూరిటీ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >