| Daily భారత్
Logo




ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్‌

News

Posted on 2025-10-13 12:24:31

Share: Share


ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్‌

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్‌పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్‌ కృష్ణానగర్‌ బీ-బ్లాక్‌లో బూత్‌ నంబర్‌ 246లోని ఓటరు జాబితాను బీఆర్‌ఎస్‌ బూత్‌ ఇన్‌చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. 8-3-231/బీ/160 నంబర్‌తో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారా? లేరా? అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటర్‌ క్రమసంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది.

ఐదు అంతస్తులతో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 15 ఫ్లాట్లు ఉండగా వాటిలో మూడు ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 12 ఫ్లాట్లలో ఉంటున్నవారిని వాకబు చేయగా తాము సంవత్సర కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయని, మరికొందరు తమకు వేరే నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. మిగతా వారు గతంలో అక్కడ నివసించి ఉంటారని అనుకుంటే, ఆ అపార్ట్‌మెంట్‌ కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నవారే మొదటి నుంచీ అక్కడ ఉంటున్నట్టు తేలింది. అపార్ట్‌మెంట్‌ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదని, అందులో 40 మందికి పైగా ఉండే అవకాశమే లేదని స్థానికులు చెప్తున్నారు.


#hyderabad #jublihills #elections 

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >