Posted on 2025-10-11 16:07:07
మరో ఇద్దరు నిందితులు గతంలోనే రిమాండ్
కేసు ఛేదనలో కృషి చేసిన సిబ్బందికి రివార్డు..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:భూమి, ఫ్లాట్ల విషయంలో తలెత్తిన వివాదం ఓ హత్యకు దారితీసింది. సిరిగిరి రమేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురికాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ కేసులో గతంలోనే మరో ఇద్దరు నిందితులు ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను రిమాండ్కు తరలించడం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిరిగిరి రమేష్ కు చిర్రం రవి చందుర్తిలో ఉన్న తన భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ పై పెట్రోల్ బంక్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, సిరిగిరి రమేష్ పెట్రోల్ బంకు ఇవ్వకపోగా, భూమిని తిరిగి రవికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. దీంతోపాటు, ఈ భూమి నాదే అంటూ దాన్ని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతేకాకుండా, సిరిగిరి రమేష్ చాలా ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని, ఆ ఫ్లాట్ల కొనుగోలుకు మధ్యవర్తిగా ఉన్న చిర్రం రవితో ఆ విషయంలోనూ గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన చిర్రం రవి, తన భూమి తనకు దక్కాలంటే రమేష్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎద్దండి వెంకటేష్, అలా వంశీలతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. తేదీ 19-09-2025 రోజున రాత్రి సుమారు 08:00 గంటల సమయంలో పెద్దూరు సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేష్ను అలా వంశీ గట్టిగా కాళ్లు పట్టుకొని ఉండగా, చిర్రం రవి వెనుక సీటులో కూర్చొని కదలకుండా పట్టుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ సీటులో ఉన్న ఎద్దండి వెంకటేష్ వారు తెచ్చుకున్న కత్తితో రమేష్ గొంతులో, ఛాతీపై పలు మార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం, సిరిగిరి రమేష్ మరణించినట్లు నిర్ధారించుకొని, ఎద్దండి వెంకటేష్ శవాన్ని కారులో తీసుకువచ్చి వేములవాడలోని నంది కమాన్ సమీపంలో గల రమేష్ యొక్క నందీశ్వర టౌన్ షిప్ వెంచర్ లో కారు వదిలిపెట్టి పారిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని శనివారం పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేష్ మరియు అలా వంశీలను గతంలోనే రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన ఎస్సై రామ్మోహన్, సిబ్బంది తిరుపతి, సమియుద్దిన్, రాజకుమార్, పాష, గోపాల్ లను రివార్డుతో అభినందించడం జరిగింది
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >