Posted on 2025-10-10 19:00:17
డైలీ భారత్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మున్నపేట పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్న సందర్భంగా విద్యార్థులు సాయంత్రము 5:15 వరకు ఉండాల్సిన అవసరం ఉంది కావున ఈరోజు అల్పాహారం అందజేయడం ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి అల్పాహారం అందించడం వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు ఇట్టి అల్పాహారం తల్లిదండ్రుల సహకారంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు TRTF (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న గారి నారాయణ మాట్లాడుతూ గత సంవత్సరము ప్రభుత్వము విద్యార్థుల అందించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థుల కొరకు స్నాక్స్ అందజేసే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరనైనది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు శనిగరం నారాయణ గుడి కాడి కొమరయ్య అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >