Posted on 2025-10-09 21:46:37
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : విద్యార్దులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.. గురువారం షాబాద్ మండలం కేంద్రంలోని మైదానంలో ఏయంఆర్ ట్రస్ట్ స్పాన్సర్ చేస్తున్న 69వ మండల స్థాయి ఎస్జిఎఫ్ కోకో, కాబట్టి, వాలీబాల్, జూనియర్ సీనియర్ లెవెల్ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందిస్తాయన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.విద్యార్దులు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం అని, క్రీడల నైపుణ్యం కోసం విద్యార్థినులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, వెంకట్ రెడ్డి,గుండాల అశోక్, సర్దార్ నగర్ మార్కెట్ డైరెక్టర్ సంజీవరెడ్డి,మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, రవీందర్ నాయక్,నర్సింలు, శ్రీనివాస్ గౌడ్, లింగం,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండు రాహుల్ గుప్త,ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు , శేఖర్, కృష్ణా రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, కిషోర్,యాదయ్య, రఫిక్, మహేష్,రమేష్, శ్రీనివాస్,సూర్య,రఘు,విజయ్ పార్టీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు...
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >