Posted on 2025-10-09 21:33:09
మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు స్పెషల్ డ్రైవ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 58 వ్యక్తులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రధాన కారణమవుతున్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరుచేయడం ద్వారా జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించడం జరుగుతోంది.
ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 58 మందికి శిక్షలు విధించింది.దేవునిపల్లి PS లో 10 మందికి జైలు శిక్ష (4 మందికి 2 రోజుల జైలు, 6 మందికి 1 రోజు జైలు , ₹1000 జరిమానా ఒక్కోరికి, దోమకొండ PS లో ఒక వ్యక్తికి 2 రోజుల జైలు + ₹1000 జరిమానా,మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు PS లో ఒక్కొక్కరికి 1 రోజు జైలు + ₹1000 జరిమానా,
కామారెడ్డి లో 14 మంది, రామారెడ్డి 1 వ్యక్తి, దేవునిపల్లి 20 మంది, బిక్నూరు: 1 వ్యక్తి, దోమకొండ 6 మంది, రాజంపేట్ 1 , సదశివ నగర్ 1 వ్యక్తి, మొత్తం 44 మందికి ₹1000 చొప్పున జరిమానా విధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ,మీ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దు. మీ నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారు. ఇకనైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ తెలిపారు.
మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
Posted On 2025-11-13 10:03:28
Readmore >
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Posted On 2025-11-12 19:12:07
Readmore >
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Posted On 2025-11-12 19:10:42
Readmore >
అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు
Posted On 2025-11-12 19:09:07
Readmore >
నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Posted On 2025-11-12 13:27:18
Readmore >
JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Posted On 2025-11-12 08:50:16
Readmore >
ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2025-11-12 08:47:02
Readmore >