Posted on 2025-10-09 23:48:22
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రూరల్ ఎమ్మెల్యే పరామర్శించనున్న సీఎం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి అనారోగ్య సమస్యలతో మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ని పరామర్శించనున్నారు. ఇదే రోజు ద్వాదశ దినకర్మ కావడంతో ఆయనను స్వయంగా కలిసి ఎమ్మెల్యే తల్లి మృతికి గల కారణాలను తెలుసుకుని ఓదార్చనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. కావున జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >