Posted on 2025-10-06 17:43:02
డైలీ భారత్, హైదరాబాద్:వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
వరంగల్కు చెందిన గణేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయాడు. దీంతో అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివినప్పటికీ కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ సీటు కూడా సాధించాడు. కానీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ.1.5 లక్షలను కట్టాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు ఆఫీజును కట్టాల్సి ఉంది. కానీ తల్లిదండ్రులు లేని గణేశ్ ఆ మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేడు. ఒకవేళ సమయానికి ఫీజు కట్టకపోతే సీటు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో గణేశ్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సాయం కోరాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. సాయం చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ.1.5 లక్షల సాయం అందజేశారు. భవిష్యత్తులో గణేశ్ చదువులకు తానే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >