| Daily భారత్
Logo




నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-09-28 15:47:00

Share: Share


నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో ప్రధాని మన్ కి బాత్  కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం - స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహిద్దాం

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారత దేశ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 126వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని  సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  కంఠేశ్వర్ మండల బిజెపి నాయకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ  వీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీనీ ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్థావించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశియా ఉత్పత్తులను ప్రోత్సాహిస్తూ సహకారం అందించడం జరుగుతుంది అన్నారు. భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేల ఎదగడం గర్వకారణం అన్నారు. నావి, ఎయిర్, రక్షణ,రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న, చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలియజేసారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా RSS చేసిన సేవలను ప్రధాని గుర్తు చేయడం జరిగిందని అన్నారు. డా. కేశవ బలిరామ్ హెగ్డేవర్,గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు ఆకాంక్షాలకు అనుగుణంగా జాతీయ పునః నిర్మాణమే లక్ష్యంగా స్వయంసేవకులు పని చేయడం జరుగుతుందని అన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని చరిత్రను ఆయన గొప్పతనాన్ని వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అయోధ్య రామ మందిర పునః నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేసారు. దేవి నవరాత్రులు, దీపావళి కానుకగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ  తగ్గింపులు చేసారని అన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటను ఇచ్చే విదంగా ఉందని అన్నారు. ప్రముఖ లలిత కళ రంగాలలో పేరు పొందిన వారికీ ప్రోత్సాహంగా పద్మశ్రీతో  గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రముఖ గాయిని లత మంగేష్ కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా సెక్రెటరీ జ్యోతి, మండల అధ్యక్షులు శక్తి కేంద్ర చార్జిలు  నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >