Posted on 2025-09-26 20:53:18
డైలీ భారత్ న్యూస్, వరంగల్/నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన అంగోత్ వీరన్న నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినందుకు గాను నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు అంగోత్ ఫుల్ సింగ్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలోత్ చరణ్ సింగ్, సీనియర్ నాయకులు మలోత్ నముకు నాయక్, జరుపుల రమేష్ నాయక్, రేలకుంట గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.
డాక్టరేట్ సాధన ద్వారా మండలానికి గౌరవం చేకూరిందని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలో నిమగ్నం అవ్వాలని అభినందనలు తెలియజేశారు. అంగోత్ వీరన్న నాయక్ శ్రమ, అంకితభావం అన్ని కార్యకలాపాలకు ప్రేరణగా ఉంటుందని గుర్తుచేశారు.
ఈ ఘన సన్మానం ద్వారా నల్లబెల్లి మండల ప్రజల కోసం విజ్ఞాన, సామాజిక సేవలో మార్గదర్శకత్వం కొనసాగేలా ఉందని నేతలు తెలిపారు.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >