| Daily భారత్
Logo




కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

News

Posted on 2025-09-24 18:21:34

Share: Share


కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ డివిజన్ ఒకటి ఖానాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు  శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను అందజేశారు.బుధవారం రోజు ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మణ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో  మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, మహిళల కోసం  ఇందిరమ్మఇండ్లు, ఉచితం బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ ప్లాంట్ లు,డ్వాక్రా  గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలను  ఇస్తున్నామని, ఇందిరాస్ మహిళా శక్తి ద్వారా రుణాలు ఇచ్చి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని అన్నారు. అలాగే సోలార్ ప్లాంట్ లను పెట్టుకుని విద్యుత్ ను ప్రభుత్వానికి  అద్దెకు ఇవ్వాలని, ప్రభుత్వమే   మహిళలకు డబ్బులు చెల్లిస్తుందని అన్నారు.బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో   ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, 200 యూనిట్ల  ఉచిత విద్యుత్, వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అని ప్రజలు బిజెపి వారిని  ఒకసారి ప్రశ్నించాలని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన కాలేశ్వరం మూడు సంవత్సరాలకే కూలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్ని  ఇప్పటివరకు ఎటువంటి  సమస్య లేకుండా ఉన్నాయని అన్నారు. కెసిఆర్ కుటుంబంలో  ఆస్తి గొడవలు జరుగుతున్నాయని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని  నమ్మద్దని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఖానాపూర్ గ్రామానికి 12 కోట్ల నిధులను కేటాయించి, రోడ్లు, అంగన్వాడి భవన్, మహిళా భవన్, వంటివి కట్టించామని అన్నారు. ప్రస్తుతం ఖానాపూర్ కాలూర్ గ్రామాలకు కలిపి 86 ఇందిరమ్మ ఇల్లు  మంజూరు చేశామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో   ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, ఖానాపూర్ డివిజన్ అధ్యక్షులు కోర్వ్  రాజేందర్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, ఎ ఏం సి డైరెక్టర్లు బాగా రెడ్డి, రాజలింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, సీనియర్ నాయకులు బాగా రెడ్డి, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >