Posted on 2025-09-23 15:46:53
దేశ ప్రజలకు నవరాత్రుల కానుక..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిఎస్టీ ద్వారా ప్రధాని మోదీ భారతీయులకు నవరాత్రి కానుకలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ జీఎస్టీ ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు కొత్త జి ఎస్టీ విధానం మేలు జరుగుతుందన్నారు.
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోజువారీ సామగ్రి పై 18 శాతం నుండి 5 శాతానికి జిఎస్టీ తగ్గించారని, ద్విచక్ర వాహనాలపై 28 శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ తగ్గిందన్నారు. అదేవిధంగా లైఫ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం లు గణనీయంగా తగ్గుముఖం పడే అవకాశం ఉందన్నారు. కొత్త జీఎస్టీ రీఫామ్ ద్వారా దేశ జీడీపీ 1 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం లో టాక్స్ ట్రాన్స్పెరెన్స్ విధానం అమలు అవుతుందన్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ ద్వారా 7 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇస్తున్నామని మేము సంతోషిస్తున్నమ్మన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో ఆదాయం తగ్గిందని ఏడుస్తున్నారని ఏద్దెవా చేశారు. ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మద్యన వ్యత్యాసం అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >