| Daily భారత్
Logo




చిన్మయ గీతా పఠన పోటీలలో సత్తా చాటిన సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు

News

Posted on 2025-09-22 14:56:30

Share: Share


చిన్మయ గీతా పఠన పోటీలలో సత్తా చాటిన సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు

డైలీ భారత్, సిరిసిల్ల: చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము పాఠశాల స్థాయి నుండి జాతీయస్థాయి వరకు బాల బాలికలకు  నిర్వహిస్తున్న చిన్మయ గీతా పఠన పోటీలలో భాగంగా ఈ సంవత్సరము కూడా చిన్మయ గీతా పఠన పోటీలు 2025 నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గాంధీ నగర్ సిరిసిల్లలో చదువుతున్న 130 మంది బాల బాలికలకు మరియు శ్రీ భక్తాంజనేయ శివ పంచాయతన దేవస్థానం బీవైనగర్ సిరిసిల్లలో ప్రతి ఆదివారం 9 గంటల నుండి 10 గంటల వరకు  నిర్వహించబడుతున్న చిన్మయ బాలవిహార్ కార్యక్రమం ద్వారా 30 మందికి పైగా విద్యార్థులకు శ్రీ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమప్రాప్తియోగములోని శ్లోకాలు పఠనము చేయడం నేర్పించడం జరిగింది వీరిని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ గ్రూపులుగా విభజించి వారి వారి స్థాయిలలో ప్రాథమిక స్థాయి పోటీలను నిర్వహించి ప్రతి గ్రూపు నుండి ప్రథమ స్థాయిలో నిలిచిన బాలబాలికలను కరీంనగర్ పాత జిల్లాస్థాయి పోటీకి పంపించడం జరిగింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అశోక్ నగర్ కరీంనగర్లో నిర్వహించబడిన జిల్లాస్థాయి చిన్మయ గీతా పఠన పోటీలు-2025 లో సిరిసిల్ల నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చదువుతున్న దూస రుత్విక్, కొయ్యడ స్వస్తిక్, కొక్కుల ప్రశస్త, మ్యాన శ్రీహిత, గాజుల తేజశ్రీ మరియు చిన్మయ బాలవిహార్ నుండి కుడిక్యాల తేజస్వి పాల్గొన్నారు జిల్లా స్థాయి పోటీలో చిరంజీవి మ్యాన శ్రీహిత డీ గ్రూపులో ప్రథమ స్థానము, కుడిక్యాల తేజస్వి ఈ గ్రూపులో ద్వితీయ స్థానము గాజుల తేజశ్రీ తృతీయ స్థానములలో నిలిచి బహుమతులను పొందినారు అంతేకాకుండా మ్యాన శ్రీహిత 2025 నవంబర్ 9వ తేదీన కడపలో నిర్వహించబడే రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే అవకాశాన్ని సాధించింది బహుమతులు పొందిన చిన్నారులను మరియు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన చిన్నారి శ్రీహితను చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షులు  సజ్జనం శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ మోతిలాల్  ఉపాధ్యక్షులు  గజ్జెల్లి రామచంద్రం శ్రీపతి కోటేశ్వరి  ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ కోశాధికార మేరుగు మల్లేశం కార్యవర్గ సభ్యులు జక్కని రమేష్ వేముల శంకర్ వెంగళ కమలాకర్ సజ్జనం సృజన లకావత్ రాజమణి మేరుగు లలిత నల్ల రాజేశ్వరి మరియు సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు వేణు కిరణ్ మరియు సమస్త ఉపాధ్యాయ బృందం చిన్నారులను అభినందించారు విద్యార్థులకు శ్లోకాల పఠనమును నేర్పించి శిక్షణ ఇచ్చిన నల్ల సత్యనారాయణ ని అందరూ అభినందించారు బహుమతులు గెలుచుకున్న చిన్నారులనందరిని చిన్మయ మిషన్ కరీంనగర్ సెంటర్ ఆచార్యులు బ్రహ్మచారి అక్షయ చైతన్య అభినందిస్తూ వారికి శిక్షణనిచ్చిన ఆచార్యులందరికీ ధన్యవాదములు తెలియజేశారు 


Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >