Posted on 2025-09-18 18:16:40
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పీఆర్టీయూ మోపాల్ మండల నూతన అధ్యక్షులుగా కొట్టూరు దేవదాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. రాజశేఖర్, మహిళ ఉపాధ్యక్షురాలుగా నీరజ లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోనీ కిషన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు కొట్టూరు దేవదాస్ మాట్లాడుతూ మోపాల్ మండల ఉపాధ్యాయుల సమస్యలపై తన వంతు పాత్ర పోషిస్తానని, అలాగే మండలంలో పీఆర్టీయూ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని మోపాల్ మండల, జిల్లా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >