Posted on 2023-12-28 11:00:27
డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడు కెప్టెన్ విజయకాంత్ (71) గురువారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు.
దీంతో ఆయనకు చెన్నైలోని ఓ హాస్సిటల్లో వెంటిలేటర్ మీద చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన కన్నుమూశారు.
ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్త తెలుసుకున్నడీడీఎంకే శ్రేణులు కన్నీరుమున్నీర వుతన్నారు.
గత కొన్ని రోజులుగా విజయకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వచ్చాయి.
ఆయన హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే.. మరణించాడనే రూమర్లు కూడా వచ్చాయి. అందరూ ఆయన చనిపోయినట్టుగా నెట్టింట్లో ట్వీట్లు కూడా పెట్టారు. కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పం దించాయి. ఆయన ఇంకా బతికే ఉన్నారని అప్డేట్ ఇచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణంతో డీడీఎంకే కార్యకర్తలు, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. గుండె బద్దలైనట్టుగా ఉందంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దు:ఖాన్ని వ్యక్తపరు స్తున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >