Posted on 2025-09-09 16:12:14
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆన్లైన్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యం అన్నారు. క్యాన్సర్ రోగులకు పగటి సమయంలోనే చికిత్స అందించడం. ఇప్పటివరకు ఎంజెఎన్ ఆసుపత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు ఇకపై రెండో డోస్ నుండి నిజామాబాద్లోని డే కేర్ సెంటర్లోనే చికిత్స పొందవచ్చనీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దీని ద్వారా నిజామాబాద్ పరిసర ప్రాంతాల రోగులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుంది. హైదరాబాదుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే సమయానికి చికిత్స పొందే అవకాశం లభిస్తుందనీ పేర్కొన్నారు. అలాగే, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు డే కేర్ క్యాన్సర్ సెంటర్లో సరఫరా చేయబడి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >