Posted on 2025-09-08 21:42:51
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు.
మూడు బ్యాగులలో భారీ మొత్తంలో నోట్లు ఉన్నట్లు ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవర్ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్స్టేషన్కు నిందితులను తరలించారు. 2016లో పెద్ద నోట్లు రద్దు కాగా.. 9 ఏళ్ల తర్వాత పట్టుబడడం అందరిని షాక్కు గురిచేసింది. రద్దయిన నోట్లను ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >