Posted on 2025-09-03 19:20:49
ఈ రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు అంటున్న పండితులు..
చంద్రగ్రహణం కారణంగా నిమజ్జనం తొమ్మిదవ రోజు చేయాలా.. 11వ రోజు చేయాలా అని సందిగ్ధంలో గణేష్ మండలి నిర్వాహకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 7 తేదీన చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో గ్రహణం వస్తున్నందున గణేష్ నిమజ్జనం గురువారం నాలుగో తేదీ చేయాలా.. లేదా ఆరవ తేదీన 11వ రోజు శనివారం చేయాలా అని సందిగ్ధంలో జిల్లాలోని పలు గణేష్ మండలి నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పోలీస్ శాఖ వారు ఈనెల 4న గురువారం నిమజ్జనం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగో తేదీన నిమజ్జనం పలు గణేష్ ప్రతిమలు నిమజ్జనానికి వెళ్తున్న నేపథ్యంలో నాలుగో తేదీ ఉదయం 6 గంటల నుండి 5వ తేదీ ఉదయం ఐదు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఆరవ తేదీన 11 రోజులు వస్తున్నందున ఆరోజు కూడా సిపి ఆదేశాలు అమలు అవుతాయా లేదా అనేది చర్చనియాంశంగా మారింది. అయితే గ్రహణం ఉన్న సందర్భంగా ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తే మంచిదో నని వినాయక భక్తులు అయోమయంలో పడుతున్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >