| Daily భారత్
Logo




ఒకే ఏడాదిలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

News

Posted on 2025-09-03 17:23:39

Share: Share


ఒకే ఏడాదిలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

అవినీతికి అడ్డాగా నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం అవినీతికి అడ్డాగా  మారింది. ఏడాది కాలంలోనే ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. గత సంవత్సరం ఆగస్టు మాసంలో నగరపాలక సంస్థల పనిచేసే ఆర్ఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తో పాటు కోట్లాది రూపాయల నగదు పాటు ఆస్తుల కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే విభాగంలోని ఇంచార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రావు 7000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ నుండి ఖాళీ స్థలం టాక్స్ చెల్లింపుల కోసం వచ్చిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నుండి 10000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి లక్ష్మీ కాంత్ రెడ్డి వెల్లడించారు. 10000 డిమాండ్ చేయగా 7000 రూపాయలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ అధికారుల వ్యూహంలో భాగంగా బుధవారం నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని రెవిన్యూ విభాగంలో ఇంచార్జ్ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావు బాధితుడు నుండి లంచం డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 7000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఇది ఇలా ఉండగా బోధన్ ప్రాంతానికి చెందిన ఆర్ ఐ శ్రీనివాసరావు 2001 సంవత్సరంలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తూ అప్పట్లో ఏసీబీకి చిక్కారు. ఓ కిరానా కొట్టుకు సంబంధించి టాక్స్ తగ్గించేందుకు ₹1000 డిమాండ్ చేయగా విషయం తెలుసుకున్న అప్పటి ఏసీబీ అధికారులు కిరాణా దుకాణంలో లంచం తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు. తాజాగా నిజామాబాద్ లో 7000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకోవడం  రెండవసారి.

Image 1

లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Posted On 2026-03-12 17:28:11

Readmore >
Image 1

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

Posted On 2026-03-12 13:47:01

Readmore >
Image 1

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

Posted On 2026-03-12 13:45:42

Readmore >
Image 1

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

Posted On 2026-03-12 13:44:39

Readmore >
Image 1

నిషేధిత హుక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం

Posted On 2026-03-12 13:10:02

Readmore >
Image 1

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

Posted On 2026-03-12 13:04:32

Readmore >
Image 1

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Posted On 2026-03-12 12:57:08

Readmore >
Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >