Posted on 2025-08-07 20:07:14
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.. భీమవరానికి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి 35 కోట్ల రూపాయల బిల్లు విడుదల చేయాల్సి ఉండగా.. దాని కోసం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్.. అయితే, ఇవాళ 25 లక్షల రూపాయాలు అడ్వాన్స్ ఇవ్వగా.. ఆ డబ్బు ఇస్తుండగా శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేయడం.. రూ.25 లక్షలతో పట్టుబడడం ఇదే తొలిసారి అంటున్నారు ఏసీబీ అధికారులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >