Posted on 2025-08-07 12:37:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీ వర్షం కురుస్తుండగా ఒకవైపు మున్సిపల్ కార్మికులు రెయిన్ కోటు ఇతర రక్షణ పరికరాలు ఏవి లేకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రెయిన్ కోట్ వేసుకొని డిప్యూటీ కమిషనర్ రవి బాబు పర్యవేక్షణ చేస్తూ, ఒక కార్మికుడితో గొడుగు పట్టించుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు వివక్షను, నిర్లక్ష్య వైఖరిని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఒ ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలు, ముఖ్యంగా వర్షాకాలంలో రెయిన్ కోట్లు ఇవ్వాలి టి యు సి ఐ గా, కార్మిక సంఘాల జేఏసీ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించని అధికారులు మొండి వైఖరిని నిరసిస్తున్నారు . వెంటనే మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు రక్షణ పరికరాలు అందివ్వాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >