Posted on 2023-12-20 13:50:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కోణార్క్ హాస్పిటల్ కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సింహారెడ్డి(MBBS,MD,DNB) వారి టీమ్ తో కలిసి పోలీస్ బెటాలియన్ సిబ్బందికి నరాల బలహీనత, వెన్నెముక మరియు మెదడు యెక్క రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. వివిధ రకాల టెస్టులు నిర్వహించారు. వ్యాధికి గల కారణాలు - నివారణలను వివరించారు. సిబ్బందికి గల అనుమానాలు నివృత్తి చేసి తగు సలహాలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ "హెల్త్ ఈజ్ వెల్త్ " అని పోలీస్ సిబ్బంది యొక్క విధులు మిగతా వారితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం, యోగ లాంటివి చేయాలనీ అన్నారు.సిబ్బంది అందరూ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కోణార్క్ హాస్పిటల్ వైద్య బృందానికి కమాండెంట్ యస్. శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జె.పి నారాయణ, యమ్.పార్థసారథి రెడ్డి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >