Posted on 2025-07-27 19:46:08
ఒకే వేదికపై తారసపడిన ఇందూరు అర్బన్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా లు పాల్గొన్నారు. అయితే ఇదే ఆత్మీయ సమ్మేళనం వేదిక గా తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కనబడడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్యవైశ్యులందరూ ఇలానే పార్టీలు వేరైనప్పటికీ కలిసిమెలిసి ఐక్యతతో ఉండాలని పలువురు గుసగుసలాడారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య పెద్దలు, అధ్యక్షా కార్యదర్శులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ1944 లో స్థాపించిన ఆర్యవైశ్య సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు. సంపద సృష్టించడంలోకూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు చెల్లెస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నాం. అని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగాలి ప్రభుత్వ ఏర్పాటులో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అగ్రవర్ణాల పేదల అభివృద్ధి గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని బిజెపి మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీకి బిజెపి పార్టీకి దక్కుతుంది. ఆర్యవైశ్య పట్టణ సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికల్లో ధర్మం గెలిసింది అనడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. ధర్మాన్ని నిలబెట్టుటకు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ధర్మం నిలపడి గెలిచింది అనేది వాస్తవం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల గురించి కొంత మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆలా అలోచించి చివరికి నవ్వులపాలు కావద్దని విజ్ఞప్తి చేసారు. ఓటమిని అంగీకరించడం కూడా విజయానికి తొలిమెట్టు అవుతుందని దానికి తనే నిదర్శనం అన్నారు. నూతనంగా గెలిసిన వారందరిని అభినందిస్తూ ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్షా, కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సంఘ అభివృద్ధిలో కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా,మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లేందుల ప్రభాకర్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >