| Daily భారత్
Logo




మండల కేంద్రంలో బస్టాండ్ ఉన్నా లేనట్లే

News

Posted on 2025-07-27 08:55:47

Share: Share


మండల కేంద్రంలో బస్టాండ్ ఉన్నా లేనట్లే

అసలే అధ్వానం, డివైడర్ వచ్చి విధ్వంసం

ప్రస్తుతం చేపల చెరువుల కలకలా

పూడుకుపోతున్న  ములకలపల్లి బస్టాండ్

కొందరికికైతే ఎక్కడుందో కూడా తెలియని వైనం

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోడ్లపైని నిరీక్షణ

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

డైలీ భారత్, ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది, మండల కేంద్రంలో బస్టాండ్ ఉన్న లేని పరిస్థితి గానే మిగిలిపోతుంది, ఇటీవలే అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు విధాన ఏర్పాట్లు బస్టాండ్ దిగువ భాగమై నేలమట్టం అయిపోతున్న పరిస్థితి ములకలపల్లి మండలంలో చర్చిని అంశంగా మారింది, 

కనీసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కానీ స్థానిక ప్రజాప్రజానికం కానీ దృష్టి పెట్టకపోవడం  పెద్ద ప్రలోభానికి దారి తీస్తుందని మండల కేంద్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి, 

సుమారు 20 పంచాయితీలు 107 గ్రామాలకు మండల కేంద్రమైన ములకలపల్లిలో బస్టాండ్ అనేది ఉన్న ఫలితం లేక లేకపోవడం పై చేసేదేమీ లేక రోడ్లపైనే నిరీక్షణ చేసి ప్రయాణం సాగిస్తున్నారు, 

నిత్యవసర వస్తువుల నుంచి ఏదైనా నమోదు ప్రాంత వస్తువులు తీసుకోవాలి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కచ్చితంగా మండల కేంద్రమైన ములకలపల్లికి రావాల్సిందే, ప్రస్తుతం ప్రవాణా సౌకర్యం లేకపోయినప్పటికీ ఆసరాగా ఉండే బస్టాండు ప్రస్తుత వర్షాకాలంలో నీటితో దర్శనమివ్వడం మండల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు, 

ఇటీవలే రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ లాంటి విద్యుత్ దీపాలు  తోటి అభివృద్ధి చేయాలను లక్ష్యంతో చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ రోడ్డు ఎత్తునా బస్టాండ్ పల్లానా ఉండటంవల్ల సగభాగం వరకు పూడకపోయి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు విమర్శలు సైతం కురిపిస్తున్నారు, 

మునుముందు తరానికి మొలకలపల్లిలో బస్టాండు అనేది ఉంటదా కనుమరుగైపోతదా అన్న విషయం మండల ప్రజల్లో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది, 

వీటంతటికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కారణమా, అభివృద్ధి భాగంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అన్న విషయంపై పలు ప్రశ్నలు మండల ప్రజలకు చిక్కుముడిగానే ఉండిపోయాయి, 

అభివృద్ధి బాట ఎప్పుడో గాని ప్రస్తుతం ములకలపల్లి బస్టాండ్ ఉన్న సగభాగమే చెరువుల తలపిస్తూ కొంత భాగం నేలమట్టం అయిపోతుంటే మండల పరిధిలో గ్రామాల ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, 

సంబంధిత అధికారులు స్పందన తీసుకొని స్థానిక శాసనసభ్యులు చొరవ తోటి ప్రదేశం మార్చి, లేకుంటే అదే ప్రదేశంలో బహిరంగంగా నూతనంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >