Posted on 2025-07-27 08:48:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:హైదరాబాద్లో జరిగిన టీఎన్జీవో కార్యవర్గ సమావేశానికి హాజరైన జిల్లా టిఎన్జీవో టీఎన్జీవో కేంద్ర కార్యాలయం నాంపల్లి, హైదరాబాద్ లో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అధ్యక్షతన, ఏర్పాటు చేసిన ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నందు నిజాంబాద్ జిల్లా పక్షాన టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని నెరవేర్చే విధంగా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల విషయంలో చాలా ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగులందరూ అసహనానికి గురవుతున్నారన్న విషయం తెలియజేస్తూ,... గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా త్వరితగతిన ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని, కోరుతూ...రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు, భవిష్యత్ కార్యాచరణను నిజాంబాద్ జిల్లా పక్షాన స్వాగతిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశానికి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ సహ అధ్యక్షులు చిట్టి నవీన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >