Posted on 2025-07-23 16:05:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వాంతులు, విరోచనాలతో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ లో చోటు చేసుకుంది. కలుషిత నీరు కారణమై ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొనింటి చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (32) తీవ్ర విరేచనాలతో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత మూడు రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలో మంది విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నారని, పలువురి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >