| Daily భారత్
Logo




వీడిన చందునాయక్‌ హత్య కేసు మిస్టరీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్‌

News

Posted on 2025-07-20 05:39:47

Share: Share


వీడిన చందునాయక్‌ హత్య కేసు మిస్టరీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్‌

ఆర్థిక, వివాహేతర సంబంధంతోనే హత్య.

రివాల్వర్‌, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన

సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీపీపీ చైతన్యకుమార్‌

డైలీ భారత్, సైదాబాద్‌ : పట్టపగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్‌ చందునాయక్‌ను కాల్చి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హయత్‌నగర్‌ మండలం కుంట్లూర్‌ వద్ద వేసిన 13 వందల మంది గుడిసెవాసుల వద్ద వసూలు చేసిన నగదు, బిల్డిర్‌ వద్ద నుంచి వసూలు చేసిన నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలే హత్యకు దారి తీసింది.

ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందు నాయక్‌ను రాజన్న అతడి అనుచరులు ఒక మూఠాగా ఏర్పడి హత్య చేశారని సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీపీపీ చైతన్యకుమార్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్‌ఈస్ట్‌ జోన్‌ అదనపు డీసీపీ శ్రీకాంత్‌, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ అందే శ్రీనివాస్‌, మలక్‌పేట, సైదాబాద్‌ డివిజన్ల ఏసీపీలు సుబ్బరామిరెడ్డి, సోమ వెంకట్‌ రెడ్డిలతో కలిసి వెల్లడించారు.

చైతన్యపురిలో నివసించే కేతావత్‌ చందు నాయక్‌ (48) సీపీఐ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న మలక్‌పేట్‌ మూసారాంబాగ్‌ డివిజన్‌ పరిధిలోని శాలివాహన నగర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌ చేసి బయటకు వస్తున్న అతడిపై దొంతి రాజేశ్‌, అలియాస్‌ రాజన్న తన అనుచరులతో కలిసి రివాల్వర్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు.

తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడి చందు నాయక్‌ కంట్లో కారం పోసి హత్య చేశారు. ప్రధాన నిందితుడు రాజన్నతో పాటు ఏడుకొండలు, అర్జున్‌ జ్ఞానప్రకాశ్‌, లింగిబేడి రాంబాబు, ప్రశాంత్‌, శ్రీను అలియాస్‌ నాగరాజును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పిస్టల్‌, రివాల్వర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌, డీఐ జయశంకర్‌, సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌, ఆనంద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Image 1

ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు

Posted On 2026-07-18 06:17:55

Readmore >
Image 1

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

Posted On 2026-07-18 06:16:11

Readmore >
Image 1

జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Posted On 2026-07-18 06:13:42

Readmore >
Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >