| Daily భారత్
Logo




యధా రాజా తథా ప్రజాగా జిల్లాలో గురుకుల హాస్టళ్లు

News

Posted on 2025-07-19 09:38:36

Share: Share


యధా రాజా తథా ప్రజాగా  జిల్లాలో గురుకుల హాస్టళ్లు

జిల్లా కలెక్టర్ నుండి సంబంధిత అధికారుల వరకు తనిఖీలు చేపట్టిన మారని పరిస్థితి

ఆర్మూర్ లో అత్యంత విషాదం.. విద్యార్థి ఆత్మహత్య.

కలకలం రేపుతున్న ఘటన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో రెండో సంవత్సరం (బైపీసీ) చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ (16) కళాశాల గ్రౌండ్ లో ఉన్న చెట్టుకు శనివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురుకుల హాస్టల్ అధికారులకు పదేపదే ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో స్వయంగా కలెక్టర్ సైతం గురుకులాల్లో తనిఖీలు చేపడుతున్న గురుకుల పాఠశాలను నడిపే అధికారులల్లో  మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాప్పటికీ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అరెపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ వేల్పూర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో స్థల సేకరణ సమస్యతో ఈ కళాశాలను ఆర్మూర్ లోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలోనే కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సంతోష్ ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.

సంతోష్ ఉదయం ఆరున్నర వరకు కళాశాల గ్రౌండ్ లోనే వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సెజ్ లను పూర్తిచేశాడు. గ్రౌండ్ నుంచి ఫ్రెషప్ కావడానికి తిరిగి తమ గదిలోకి వెళ్లిన సంతోష్ టవల్ తీసుకొని వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. కాలేజీకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న సంతోష్ వారం రోజుల క్రితమే కళాశాలకు వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం వచ్చిన సంతోష్ తన తోటి మిత్రుల్లో ఒకరిద్దరికి తనకి ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సంతోష్ కు ఫస్ట్ ఇయర్ బైపీసీలో మూడు బ్యాక్లాగ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. తమ గ్రూపులో 13 మంది విద్యార్థులు ఉండగా అందరితో కలివిడిగానే ఉంటాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు.

Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >
Image 1

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నీ కలిసిన సర్పంచ్

Posted On 2026-07-17 13:48:52

Readmore >
Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >