Posted on 2025-07-19 12:50:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక లేనిపోని అసత్యపు ఆరోపణలు చేస్తూ జిల్లా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామ్మర్తి గోపి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించిన కెసిఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అనేక అక్రమ కేసులు, ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ విషయం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటినీ చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన విమర్శించారు. తమపై తమ పార్టీ కార్యకర్తలపై బిఆర్ఎఫ్ నేతలు కార్యకర్తలు దాడులకు దిగితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ జనరల్ సెక్రటరీ వేణు రాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్కీ యాదవ్, వినోద్ కుమార్, శోభన్, అవిన్, రమేష్, నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >