Posted on 2025-07-16 14:20:30
పరారైన ఆర్టీవో అసిస్టెంట్ అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భిక్కనూరు మండలంలోని పొందుర్తి ఆర్జీవో చెక్ పోస్ట్ లో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడులతో ఈ చెక్ పోస్ట్ లో పనిచేసే ఆర్టీవో అధికారుల అసిస్టెంట్లు పరారైనట్టు తెలిసింది. మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద చెక్ పోస్ట్ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసులు చేస్తున్నారని సమాచారం మేరకు ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో మద్నూర్ మండలం సలాబత్ పూర్ అంతర్రాష్ట చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈదాడుల్లో రూ.1.20 లక్షలను అధికారులు సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >