Posted on 2025-07-16 12:58:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. బుధవారం డిచ్ పల్లి ఏడో బెటాలియన్ లో కమాండెంట్ సత్యనారాయణ, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొక్కలను నాటారు. అంతకుముందు ఏడో బెటాలియన్ పోలీసులు పోలీసు బ్యాండ్ ద్వారా గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు స్వాగతం పలికారు. తెయూ రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ కు విద్యార్థుల ద్వారా స్వాగతం లభించింది. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >