Posted on 2025-07-16 12:58:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. బుధవారం డిచ్ పల్లి ఏడో బెటాలియన్ లో కమాండెంట్ సత్యనారాయణ, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొక్కలను నాటారు. అంతకుముందు ఏడో బెటాలియన్ పోలీసులు పోలీసు బ్యాండ్ ద్వారా గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు స్వాగతం పలికారు. తెయూ రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ కు విద్యార్థుల ద్వారా స్వాగతం లభించింది. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >