| Daily భారత్
Logo




కళ్ళు కూడా తెరవని పసికందును రోడ్డుపై పడి వేసిన కసాయి తల్లి

News

Posted on 2025-07-15 23:08:55

Share: Share


కళ్ళు కూడా తెరవని పసికందును రోడ్డుపై పడి వేసిన కసాయి తల్లి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అక్రమ సంతానమో.. లేక కూతురు పుట్టిందని సాకలేకనో.. ఓ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. కళ్లు కూడా తెరువని పసికందును రోడ్డుపై పడేసింది. ఇంకా వెలుగును కూడా చూడని ఆ బిడ్డ బతుకును చీకట్లో కలిపేసింది. తన బతుకులోని చీకటి తొలగించుకునేందుకు, ఆ పసిబిడ్డ జీవితాన్ని అంధకారం చేసింది.

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఆడ బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసి, చక్కగా చీకట్లో జారుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో జరిగింది. చిన్నారిని రోడ్డుపై వదిలేయడంతో ఆ పసికందు లేత చర్మంపై గాయాలయ్యాయి.

నగరంలోని పద్మానగర్ 100 ఫీట్ల రోడ్డుకు వెళ్లేదారిలో ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ చిన్నారిని అక్కడే రోడ్డుపై వదిలేసి, ఆ తల్లి పారిపోయింది. స్థానికులు గమనించి దగ్గరకు తీసుకున్నారు. తల్లి ఎదపై వెచ్చగా సేద తీరాల్సిన ఆ శిశువు చీకట్లో గుక్కపట్టి ఏడవడాన్ని చూసి చలించిపోయారు. పాపకు పాలు పట్టి జో కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో చిన్నారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పెళ్లి కాని యువతి గర్భం దాల్చి, ఇలా పసికందును కని వదిలేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >